కుంటుపడిన పారిశ్రామిక అభివృద్ధి : పోలంరెడ్డి
ABN , First Publish Date - 2022-03-06T03:44:20+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివా
కొడవలూరు మార్చి 5 : వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలో పెమ్మారెడ్డిపాలెం ,కొత్తవంగల్లు గ్రామాల్లో శనివారం గౌరవసభలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజలు పూలమాలలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొత్తవంగల్లులోని అంబేద్కర్ విగ్రహానికి పోలంరెడ్డి పూలమాలలు వేసి ఘనని వాళులర్పించారు. అనంతరం కొత్తవంగల్లు సభలో ఆయన మాట్లాడుతూ మండలంలోని కొత్త వంగల్లు, తలమంచి ,యల్లాయపాలెం, రేగడిచెలిక గ్రామాల్లో ప్రభుత్వ సంపద గ్రావెల్ అక్రమార్కలు దోచుకుంటున్నారని, వారిని ప్రజలు తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెక్కా మదన్, చెక్కా నారయ్య, చెముకుల కృష్ణచైతన్య, జొన్నా శివకుమార్, గరికపాటి రాజేంద్రకుమార్, నాసిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.