వైసీపీ నేత హత్య కుట్రను చేధించిన పోలీసులు
ABN , First Publish Date - 2020-02-22T21:47:03+05:30 IST
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఒకప్పుడు కుప్పం టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా విద్యాసాగర్ పనిచేశారు. ఆ తర్వాత 2018లో ఆయన వైసీపీలో చేరారు.
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఒకప్పుడు కుప్పం టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా విద్యాసాగర్ పనిచేశారు. ఆ తర్వాత 2018లో ఆయన వైసీపీలో చేరారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తనకు ప్రాణహాని ఉందని వారం క్రితం విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు విద్యాసాగర్ హత్య కుట్రను చేధించారు. రౌడీషీటర్ రత్న, గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీరిలో గణేష్ ఓ హత్యకేసులో ముద్దాయిగా ఉన్నారు. విద్యాసాగర్ హత్యకు గణేష్తో రత్న 10 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడు. వీరిద్దరి అరెస్ట్తో కుట్ర భగ్నమైంది.