కాళ్లు మొక్కుతామన్నా కనికరించని తెలంగాణ పోలీసులు

ABN , First Publish Date - 2021-05-14T13:58:38+05:30 IST

జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా అంబులెన్స్‌లు నిలిచిపోయాయి.

కాళ్లు మొక్కుతామన్నా కనికరించని తెలంగాణ పోలీసులు

కర్నూలు: జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ మాట్లాడుకున్నామని... కాళ్లు మొక్కుతామని తిరుపతికి చెందిన ఓ మహిళ వేడుకున్నా తెలంగాణ పోలీసులు కనికరించలేదు. అంబులెన్స్‌ను హైదరాబాద్‌కు పంపించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక సదరు మహిళ తన భర్తను అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తీసుకొచ్చింది. అయితే ఆక్సిజన్ బెడ్ లేవని ఆస్పత్రిలో చేర్చుకోలేదని మహిళ వాపోయింది. ఆక్సిజన్ బెడ్ కోసం  జీజీహెచ్ వద్ద  మహిళ వేచి ఉన్నప్పటికీ ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కాగా... అంబులెన్స్‌లోని ఆక్సిజన్ అయిపోతుందని మహిళ ఆందోళన చెందుతోంది. 

Updated Date - 2021-05-14T13:58:38+05:30 IST