భార్య పట్ల అమానుష పద్ధతుల్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వేధింపులు

ABN , First Publish Date - 2020-09-21T14:29:48+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి పట్ల సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు.

భార్య పట్ల అమానుష పద్ధతుల్లో  సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వేధింపులు

కర్నూలు: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి పట్ల సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జిల్లాలోని ఆదోని కిల్చిన్ పేటలో చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గోపీనాథ్ అమానుష పద్ధతుల్లో భార్య ఆశాభానును వేధింపులకు గురిచేశారు. అదనపు కట్నం కోసం చేతులకు బేడీలు వేసి పదేళ్లుగా హింసిస్తున్నాడని భార్య ఆశాబాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2011 ఫిబ్రవరిలో ఆశా బాను, గోపినాధ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

Updated Date - 2020-09-21T14:29:48+05:30 IST