AP: కోడుమూరు స్టేషన్లో ముద్దాయిల విచారణ వీడియో వైరల్
ABN , First Publish Date - 2021-11-01T16:51:13+05:30 IST
జిల్లాలోని కోడుమూరు స్టేషన్లో ముద్దాయిల విచారణ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కర్నూలు: జిల్లాలోని కోడుమూరు స్టేషన్లో ముద్దాయిల విచారణ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండు రోజుల క్రితం గోరంట్లలో ఎస్సై వేణుగోపాల్పై దాడి చేసిన బెల్టు షాపు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై పేరు చెప్పి గోరంట్ల వైసీపీ సర్పంచ్ బాలకృష్ణ నెలకు ఆరు వేల రూపాయలు తీసుకున్నాడని విచారణలో ముద్దాయిల వెల్లడించారు. కాగా... ముద్దాయిలపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి బలవంతంగా చెప్పించారని సోషల్ మీడియాలో సర్పంచ్ వర్గీయులు వాదించారు.