Kurnool: ఇద్దరు బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులు
ABN , First Publish Date - 2021-11-13T16:56:13+05:30 IST
జిల్లాలోని చాగలమర్రి మండలంలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
కర్నూలు: జిల్లాలోని చాగలమర్రి మండలంలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాస్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా మధ్యవర్తుల ద్వారా పాస్టర్ పంచాయతీ నిర్వహించాడు. కాగా విషయం తెలిసిన పోలీసులు పాస్టర్ను అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ ప్రసన్న కుమార్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.