AP: పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు...గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-11-14T13:26:43+05:30 IST

జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

AP: పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు...గంజాయి పట్టివేత

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి నంద్యాలకు కారులో తరలిస్తున్న రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయిని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సీడ్స్ వ్యాపారం ముసుగులో గంజాయి వ్యాపారం చేస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 


Updated Date - 2021-11-14T13:26:43+05:30 IST