AP: కొత్తూరు సుబ్బరాయుడు దేవస్థానానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2021-11-14T17:51:44+05:30 IST
జిల్లాలోని పాణ్యం మండలం ప్రముఖ శైవ క్షేత్రం కొత్తూరు సుబ్బరాయుడు దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.
కర్నూలు: జిల్లాలోని పాణ్యం మండలం ప్రముఖ శైవ క్షేత్రం కొత్తూరు సుబ్బరాయుడు దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన అభిషేకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు.