Kurnoolలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-11-24T14:19:21+05:30 IST

జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలోని ఎల్‌ఎల్‌సి కాలువ సమీపంలో గొల్ల గోవింద్(38) దారుణ హత్యకు గురయ్యాడు.

Kurnoolలో వ్యక్తి దారుణ హత్య

కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలోని ఎల్‌ఎల్‌సీ కాలువ సమీపంలో గొల్ల గోవింద్(38) దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు వివాహేతర సంబంధం కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడు పెద్దకడుబూర్ మండలం హనుమపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-24T14:19:21+05:30 IST