కర్నూలు కలెక్టరేట్లో సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు అవమానం
ABN , First Publish Date - 2021-07-27T05:30:00+05:30 IST
కర్నూలు కలెక్టరేట్లో సుగాలి ప్రీతి కుటుంబసభ్యులకు అవమానం జరిగింది.
కర్నూలు జిల్లా: కర్నూలు కలెక్టరేట్లో సుగాలి ప్రీతి కుటుంబసభ్యులకు అవమానం జరిగింది. పరిహారం విషయంలో కలెక్టర్ను కలిసేందుకు వచ్చిన ప్రీతి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. నాలుగేళ్ల క్రితం ప్రీతి అత్యాచారానికి గురైంది. అప్పటి నుంచి ఆమె తల్లిండ్రులు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ వీరపాండియన్ గతంలో హామీ ఇచ్చారు. అయితే ఆయన బదిలీ అయ్యారు. నిన్న ప్రీతి తల్లిదండ్రులు కలెక్టర్ను కలిసేందుకు వెళ్లారు. అక్కడ పోలీసులు వారిని కలెక్టర్ను కలవనీయకుండా అరెస్టు చేశారు. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.