Kurnool: యూట్యూబ్ ఛానల్ విలేకరి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-08-09T14:46:20+05:30 IST

జిల్లాలోని నంద్యాలలో దారుణ హత్య జరిగింది. యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి కేశవులను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా

Kurnool: యూట్యూబ్ ఛానల్ విలేకరి దారుణ హత్య

కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో దారుణ హత్య జరిగింది. యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి కేశవులను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుట్కా వ్యాపారులతో కానిస్టేబుల్‌ సంబంధాల ఆడియోను కేశవులు బయటపెట్టాడు. దీంతో  కేశవులుపై కానిస్టేబుల్ సుబ్బయ్య పగ పెంచుకుని హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సుబ్బయ్య పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సుబ్బయ్యతో పాటు అతని తమ్ముడు నాని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Updated Date - 2021-08-09T14:46:20+05:30 IST