కర్నూలు జిల్లాలో విచిత్ర ఘటన

ABN , First Publish Date - 2021-08-18T23:46:20+05:30 IST

జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన మూడు ఇళ్లలో వరుసగా మంటలు చెలరేగాయి.

కర్నూలు జిల్లాలో విచిత్ర ఘటన

కర్నూలు: జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన మూడు ఇళ్లలో వరుసగా మంటలు చెలరేగాయి. ఒక ఇంటిలో మంటలు ఆర్పితే మరో ఇంట్లో మంటలు చెలరేగడంతో స్థానికులు మూడు ఇళ్లలోని సామాన్లను బయటకువేసి బిక్కుబిక్కుమంటూ భయంతో వణికి పోతున్నారు. ఇది దైవం పని అని ఒకరంటే కాదు దయ్యం పని అని మరొకరంటున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఒకటో వార్డులో ఖాజావలి అతని ఇద్దరు కొడుకులు మన్సూర్, ఖలీల్ వరుసగా మూడు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఉదయం ఖాజావలి ఇంటిలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వాటిని ఆర్పివేశారు. షార్ట్ సర్కూట్ వలన మంటలు రేగివుంటాయనే అనుమానంతో సర్వీస్ వైర్ కట్ చేశారు. అయితే కొద్దిసేపటికే మంటలు తిరిగి చెలరేగడంతో కుటుంబసభ్యులు అర్పేశారు. ఇక్కడ మంటలు ఆర్పేలోపు కొడుకు మన్సూర్ ఇంటిలో మంటలు రేగాయి. అక్కడ ఆర్పేలోపు ఖలీల్ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఉదయం నుంచి మంటలు అంటుకుంటుండంతో ప్రజల సహాయంతో మూడు ఇళ్లలోని వస్తువులను బయటకు వేశారు. 

Updated Date - 2021-08-18T23:46:20+05:30 IST