కర్నూలు జిల్లా: మహిళను మోసం చేసిన కానిస్టేబుల్

ABN , First Publish Date - 2022-01-23T18:42:48+05:30 IST

స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ చేతిలో మోసపోయిన ఓ బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన...

కర్నూలు జిల్లా: మహిళను మోసం చేసిన కానిస్టేబుల్

కర్నూలు జిల్లా: స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ చేతిలో మోసపోయిన ఓ బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోనికి చెందిన ఓ మహిళ ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. ఆ తర్వాత స్పెషల్ పార్టీ కానిస్టేబుల్  రాజేష్‌తో పరిచయం ఏర్పడింది. అండగా ఉంటానని నమ్మించిన ఆయన డబ్బు, నగలు స్వాహా చేసి మొహం చాటేశాడు. అప్పటికే వివాహం అయి పిల్లలు కూడా ఉన్నా.. ఆ విషయాన్ని దాచిపెట్టిన కానిస్టేబుల్ బాధితురాలిని మోసం చేశాడు. ఆమెకు ఈ విషయం తెలియడంతో రాజేష్‌ను నిలదీసింది. దాంతో అసలు రూపం చూపించిన రాజేష్ పొమ్మన్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-01-23T18:42:48+05:30 IST