Srisailamలో అవినీతిపై మరోసారి ఏసీబీ విచారణ
ABN , First Publish Date - 2021-11-16T15:15:23+05:30 IST
శ్రీశైలంలో అవినీతిపై మరోసారి ఏసీబీ విచారణ చేపట్టింది. 2016-19లో దేవస్థానంలోని పలు కౌంటర్లలో జరిగిన స్కామ్పై విచారణ జరుగనుంది.
కర్నూలు: శ్రీశైలంలో అవినీతిపై మరోసారి ఏసీబీ విచారణ చేపట్టింది. 2016-19లో దేవస్థానంలోని పలు కౌంటర్లలో జరిగిన స్కామ్పై విచారణ జరుగనుంది. ఇప్పటికే 5 కేసులకు సంబంధించి 8 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయ్యింది. తాజాగా మరో 8 కేసులు ఏసీబీ నమోదు చేసింది. శ్రీశైలం దేవస్థానంలోని పలు కీలక రికార్డులను ఏసీబీ పరిశీలించనుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.