Srisailamలో వైభవంగా కార్తీకమాసోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-05T13:36:25+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంభికామల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీకమాసోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

Srisailamలో వైభవంగా కార్తీకమాసోత్సవాలు ప్రారంభం

కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంభికామల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీకమాసోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు కార్తీకదీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. నేటి నుంచి స్వామివారి గర్భాలయంలో స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలుపుదల  చేయనున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి గర్భాలయంలో అభిషేకాలు తాత్కాలికంగా నిలుపుదల చేశాం ఈఓ లవన్న తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించి  భక్తులు  మొక్కులు తీర్చుకుంటున్నారు. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-11-05T13:36:25+05:30 IST