Srisailamలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-15T12:19:05+05:30 IST

శ్రీశైలం ఆలయంలో భక్తులు రద్దీ పెరిగింది. కార్తీకమాసం కార్తీక సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ క్యూలైన్లు

Srisailamలో పెరిగిన భక్తుల రద్దీ

కర్నూలు : శ్రీశైలం ఆలయంలో భక్తులు రద్దీ పెరిగింది. కార్తీకమాసం కార్తీక సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయంలో శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. స్వామివారి దర్శనానికి 5 గంటలు సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీశైలం గంగాధర మండపం వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీశైలంలోని పాతాళగంగలో కార్తీక పుణ్య స్నానాలచరిస్తున్నారు.

Updated Date - 2021-11-15T12:19:05+05:30 IST