కువైట్లో 75 వేలకు చేరిన కోవిడ్ కేసులు !
ABN , First Publish Date - 2020-08-15T19:46:29+05:30 IST
కువైట్లో మహమ్మారి కోవిడ్-19 కేసులు 75 వేల మార్కును దాటాయి.
కువైట్ సిటీ: కువైట్లో మహమ్మారి కోవిడ్-19 కేసులు 75 వేల మార్కును దాటాయి. శుక్రవారం నమోదైన 699 కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 75,185కు చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 641 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడంతో మొత్తం రికవరీలు 66,740 అయ్యాయి. ఇక నిన్న సంభవించిన ఐదు కొత్త మరణాలతో కలిపి ఇప్పటివరకు 494 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 7,951 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 115 మంది ఐసీయూలో ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న ఈ మహమ్మారి ఇప్పటివరకు 2 కోట్ల 13 లక్షల మందికి ప్రబలింది. 7 లక్షల 63 వేల మందిని పొట్టనబెట్టుకుంది.