Maharashtra Floods: భారత్‌కు సంఘీభావం తెలిపిన కువైట్

ABN , First Publish Date - 2021-07-25T16:40:12+05:30 IST

మహారాష్ట్రలో వరదలపై కువైట్ భారత్‌కు సంఘీభావం తెలిపింది.

Maharashtra Floods: భారత్‌కు సంఘీభావం తెలిపిన కువైట్

కువైట్ సిటీ: మహారాష్ట్రలో వరదలపై కువైట్ భారత్‌కు సంఘీభావం తెలిపింది. మహారాష్ట్రలో కుండపోత వర్షాల కారణంగా పోటెత్తిన వరదలకు భారీ మొత్తంలో ప్రాణనష్టం జరగడం పట్ల ఆ దేశ విదేశాంగ శాఖ శుక్రవారం సానుభూతి తెలియజేసింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రజలకు, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, సాధ్యమైనంత త్వరగా బాధితులు కోలుకోవాలని ఆకాంక్షించింది. ఇక మహారాష్ట్రలో వరదలు పోటెత్తడంతో పాటు భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడడంతో గడిచిన 48 గంటల్లో ఏకంగా 129 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో గల్లంతైనట్లు సమాచారం. వరదల కారణంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భీకర పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.    

Updated Date - 2021-07-25T16:40:12+05:30 IST