డొమెస్టిక్ వర్కర్ల ఎంట్రీ వీసా గడువు పెంచిన కువైట్
ABN , First Publish Date - 2021-05-13T14:10:07+05:30 IST
గల్ఫ్ దేశం కువైట్ డొమెస్టిక్ వర్కర్ల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఎంట్రీ వీసా గడువును మూడు నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది.
కువైట్ సిటీ: గల్ఫ్ దేశం కువైట్ డొమెస్టిక్ వర్కర్ల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఎంట్రీ వీసా గడువును మూడు నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది. ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఇకపై వర్కర్ల రెసిడెన్సీ పర్మిట్ గడువు వారి పాస్పోర్టుల్లో రెండు ఏళ్లకు బదులు 18 నెలలుగా ప్రింట్ కానుందని కువైట్ డొమెస్టిక్ లేబర్ యూనియన్ హెడ్ ఖలీద్ అల్ దఖ్నన్ వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. దీనివల్ల వేలాది మంది విదేశీ వర్కర్లకు మేలు కలుగుతుందని ఖలీద్ పేర్కొన్నారు. ఇక భారత్లో కొనసాగుతున్న మహమ్మారి కరోనా కల్లోలం కారణంగా గత నెల నుంచి భారత విమానాలపై కువైట్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది వివిధ కారణాలతో భారత్కు వచ్చి ఇక్కడే చిక్కుకుపోయారు.