కువైట్లో 60 వేలకు చేరిన రికవరీలు
ABN , First Publish Date - 2020-08-05T19:42:15+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం నుంచి కువైట్ కోలుకుంటోంది.
కువైట్ సిటీ: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం నుంచి కువైట్ కోలుకుంటోంది. అంతకంతకు రికవరీలు పెరుగుతున్నాయి. తాజాగా కువైట్లో రికవరీలు 60వేల మార్కును దాటాయి. మంగళవారం నమోదైన 587 రికవరీలతో కలిపి ఇప్పటివరకు ఆ దేశంలో కోలుకున్నవారి సంఖ్య 60,326కు చేరింది. అలాగే నిన్న 475 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ బాధితులు 68,774 అయ్యారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా 465 మందిని ఈ మహమ్మారి కబళించింది. ప్రస్తుతం దేశంలో 8వేల యాక్టివ్ కేసులు ఉండగా... 131 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న ఈ వైరస్ ఇప్పటికే 7 లక్షల మందిని బలిగొంది. కోటి 87 లక్షల మందికి ప్రబలింది.