ఐపీఎల్: పది ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ స్కోర్ ఎంతంటే..

ABN , First Publish Date - 2020-09-25T02:12:39+05:30 IST

ఐపీఎల్ 2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న...

ఐపీఎల్: పది ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ స్కోర్ ఎంతంటే..

పది ఓవర్లు ముగిసే సమయానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్కోర్ 90/1

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ జట్టు పది ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద చాహల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. అయితే.. మరో ఓపెనర్, పంజాబ్ జట్టు కెప్టెన్ లోకేష్ రాహుల్ నిలకడగా రాణిస్తున్నాడు.


హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 12 ఓవర్లు ముగిసే సమయానికి 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేశాడు. నికోలస్ పూరన్ కూడా నిలకడగా రాణిస్తుండటంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోహ్లీ సేన ముందు భారీ లక్ష్యాన్నే నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-09-25T02:12:39+05:30 IST