బెంగళూరుపై పంజాబ్ అద్భుతమైన విజయం

ABN , First Publish Date - 2020-09-25T04:47:00+05:30 IST

ఐపీఎల్ 2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 97 పరుగుల భారీ తేడాతో

బెంగళూరుపై పంజాబ్ అద్భుతమైన విజయం

దుబాయి: ఐపీఎల్ 2020లో భాగంగా జరిగిన ఆరో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 97 పరుగుల భారీ తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించి జెండా పాతింది. మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాభవంతో పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌ను కసిగా ఆడింది. పంజాబ్ కెప్టెన్ లోకేష్ రాహుల్ బ్యాట్‌తో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 62 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత రాహుల్ మరింత చెలరేగాడు. మ్యాచ్ ముగిసే సమయానికి 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 132 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి బెంగళూరుకు 207 పరుగుల టార్గెట్‌ను ఇచ్చింది.


ఇక బెంగళూరు నుంచి బ్యాటింగ్‌కు దిగిన ఒక్క బ్యాట్స్‌మన్ కూడా ఈ మ్యాచ్‌లో ఏ మాత్రం ఆకట్టుకోలేదనే చెప్పాలి. బెంగళూరు నుంచి బ్యాటింగ్‌కు దిగిన బ్యాట్స్‌మెన్‌ను పంజాబ్ బౌలర్లు వెంట వెంటనే పెవిలియన్‌కు పంపారు. బెంగళూరు జట్టు నుంచి ఒక్క ఆటగాడు కూడా ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేయలేకపోయారంటే పంజాబ్ బౌలర్లు ఏ విధంగా చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా బెంగళూరు జట్టు 17 ఓవర్లలో 109 పరుగులు చేసి అన్ని వికెట్లను కోల్పోయింది. 97 పరుగుల భారీ తేడాతో పంజాబ్‌పై పరాజయం చెందింది. 

Updated Date - 2020-09-25T04:47:00+05:30 IST