టీడీఎల్పీ విలీనం రాజ్యాంగ విరుద్ధం: రమణ
ABN , First Publish Date - 2021-04-09T09:15:28+05:30 IST
టీడీపీ శాసనసభా పక్షం(టీడీఎల్పీ) టీఆర్ఎస్లో విలీనం అవుతున్నట్లు స్వతంత్రంగా ప్రకటన చేయడం
హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): టీడీపీ శాసనసభా పక్షం(టీడీఎల్పీ) టీఆర్ఎస్లో విలీనం అవుతున్నట్లు స్వతంత్రంగా ప్రకటన చేయడం రాజ్యాంగ విరుద్ధమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. టీడీపీ బీ ఫారంపై సైకిల్ గుర్తుతో ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఖండించారు. ఎమ్మెల్యేల నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ప్రకటించారు.