దాడి చేసిన వారిని అరెస్టు చేయండి

ABN , First Publish Date - 2020-07-14T10:19:24+05:30 IST

పలాస సీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న గిన్ని నారాయణపై దాడిచేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ..

దాడి చేసిన వారిని అరెస్టు చేయండి

పలాస, జూలై 13: పలాస సీహెచ్‌సీలో  ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న గిన్ని నారాయణపై దాడిచేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని  వైద్యులు, సిబ్బంది ధర్నా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ వృద్ధురాలిని చికిత్సకోసం ఆసు పత్రికి తీసుకురాగా, ఆమె అప్పటికే మృతి చెందడాన్ని గుర్తిం చామని తెలిపారు. నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ సమయంలో కొందరు మృతు రాలి బంధువులు నారా యణపై దాడి చేశారని చెప్పారు. కరోనా సమయంలో  ప్రాణాలకు తెగించి పని చేస్తుంటే రోగుల బంధువులు దాడిచేయడం తగదన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని, నిందితులకు అరెస్టుచేసి, భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా  చర్యలు తీసుకోవాలని  డిమాం డ్‌ చేశారు. కాశీబుగ్గ సీఐ వేణు గోపాలరావు వైద్యులు, సిబ్బందితో మాట్లాడి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.  కార్యక్రమంలో ఆసు పత్రి సూపరింటెంటెంట్‌ డి.రమేష్‌, శివప్రసాద్‌, నీలవేణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T10:19:24+05:30 IST