ఆసుపత్రి ల్యాబ్లో బాలికపై టెక్నీషియన్ అత్యాచారం
ABN , First Publish Date - 2020-08-14T18:20:37+05:30 IST
ఉద్యోగమిప్పిస్తామని ఆశ చూపించి ఓ మైనర్ బాలికపై ఆసుపత్రి ల్యాబ్లోనే అత్యాచారం జరిపిన టెక్నీషియన్ బాగోతం....
న్యూఢిల్లీ : ఉద్యోగమిప్పిస్తామని ఆశ చూపించి ఓ మైనర్ బాలికపై ఆసుపత్రి ల్యాబ్లోనే అత్యాచారం జరిపిన టెక్నీషియన్ బాగోతం ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది. ఓ యువకుడు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. 17 ఏళ్ల ఓ బాలికకు ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ల్యాబ్ లో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన గురించి బాలిక తల్లికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.