కార్మికులు నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2020-12-01T05:08:56+05:30 IST
బొగ్గు వెలికితీతలో కార్మికులు నిబంధనలు పాటించాల ని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్ సూచించారు.
సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ .. కొండాపురం గని సందర్శన
మణుగూరుటౌన్, నవంబరు 30: బొగ్గు వెలికితీతలో కార్మికులు నిబంధనలు పాటించాల ని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్ సూచించారు. సోమవారం మణుగూరు ఏరియాలోని కొండాపురం కంటిన్యూయస్ మైనర్స్ ప్రాజెక్ట్ గనిని ఆయన సందర్శించారు. సంబంధిత, ఏరియా అధికారులతో కలసి గనిలో వెళ్లారు. టన్నెల్ పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. బొగ్గు వెలికితీతలో ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. అనంతరం పీకేఓసీ-2 గనికి చేరుకుని గొర్రపేటవాగు మళ్లింపు పనులు పరిశీలించారు. ఈ పర్యట నలో డైరెక్టర్ వెంట ఎస్వోటూ డైరెక్టర్ ఆపరేషన్స్ దేవికుమార్, జీఎం ఆర్అండ్డీ కె గురువయ్య, జీఎం ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ సీతయ్య, ఏరియా జీఎం జక్కం రమేష్, ఎస్వోటూ జీఎం బోగ వెంకటేశ్వర్లు, ఏరియా సేఫ్టీ అధికారి వెంకటరమణ, ఏజెంట్ కేపీ యూజీ వెంటరమణ, ఎస్వోఎం శ్రీనివాస్, సేఫ్టీ అధికారి మధుబాబు, సీనియర్ సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్ పాల్గొన్నారు.