క్వారీ ప్రమాదంలో కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-04-21T05:23:35+05:30 IST
బవులవాడ సమీపంలోని వెంగమాంబ స్టోన్ క్రషర్కు చెందిన క్వారీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు.
మరొకరికి తీవ్ర గాయాలు
కొత్తూరు, ఏప్రిల్ 20: బవులవాడ సమీపంలోని వెంగమాంబ స్టోన్ క్రషర్కు చెందిన క్వారీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ ఎస్ఐ ఈశ్వరరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. బవులవాడ గ్రామానికి చెందిన చొప్పా పైడిరాజు (37) కొండ రాయిని పగులగొట్టేందుకు మంగళవారం క్వారీలోకి వెళ్లాడు. పక్కనే ఉన్న వేరొక రాయిని పేల్చేందుకు పెట్టిన జెల్టెన్స్టిక్స్ కొండబాంబును చూసుకోకుండా కంప్రెజర్తో రాయిని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా పేలడంతో రాళ్ల ముక్కలు పైడిరాజు, మరో కార్మికుడు ఊడి సత్తిబాబుపై పడ్డాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పైడిరాజు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ సత్తిబాబు అనకాపల్లిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎస్ఐ ఈశ్వరరావు చెప్పారు. పైడిరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కు కోల్పోయామని వారు భోరున విలపిస్తున్నారు.