‘డబుల్’ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించం
ABN , First Publish Date - 2020-09-22T06:51:05+05:30 IST
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో నా ణ్యత లోపిస్తే ప్రభుత్వం సహించబోమని మంత్రి ప్రశాం త్రెడ్డి అన్నారు
మోర్తాడ్/వేల్పూర్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో నా ణ్యత లోపిస్తే ప్రభుత్వం సహించబోమని మంత్రి ప్రశాం త్రెడ్డి అన్నారు. సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంతో పా టు వేల్పూర్లో కొనసాగుతున్న డబుల్బెడ్రూంల ఇళ్ల నిర్మా ణ పనులను మంత్రి పరిశీలించారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులు నత్తనడకన సాగడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి.. దసరా లోపు లబ్ధిదారులకు అందేలా చూడాలని కాం ట్రాక్టర్ను ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.