మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వేణు

ABN , First Publish Date - 2021-10-17T06:45:11+05:30 IST

మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యంగా వైఎస్సార్‌ ఆసరా అమలుచేస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.

మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వేణు

కొత్తపేట, అక్టోబరు 16: మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యంగా వైఎస్సార్‌ ఆసరా అమలుచేస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం వానపల్లిలో ఆసరా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు మంత్రి వేణు, ఎంపీ అనూరాధలు పాల్గొన్నారు. ముందుగా గ్రామ దేవత పళ్లాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు  చేశారు. అనంతరం వైఎస్సార్‌ ఆసరా రెండోవిడత చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  కొత్తపేట, రావులపాలెం జడ్పీటీసీలు గూడపాటి రమాదేవి, కుడుపూడి శ్రీనివాస్‌, ఎంపీపీ మార్గాన గంగాధరరావు, ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి డేవిడ్‌రాజు, బొక్కా వెంకటలక్ష్మి, ముత్యాల వీరభద్రరావు, పెదపూడి శ్రీనివాస్‌, బండారు మంగతాయారు, కామిశెట్టి అమ్మన్నాయుడు, ఎంపీడీవో కె.రత్నకుమారి, తహశీల్దార్‌ జీడీ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-17T06:45:11+05:30 IST