జగన్ పాలన రివర్స్ లో నడుస్తోంది..: కన్నా లక్ష్మీ నారాయణ

ABN , First Publish Date - 2022-01-26T17:15:44+05:30 IST

బీజేపీ ఆఫీసులో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు

జగన్ పాలన రివర్స్ లో నడుస్తోంది..: కన్నా లక్ష్మీ నారాయణ

గుంటూరు: బీజేపీ ఆఫీసులో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ  కార్యక్రమంలో పార్టీ నేతలు జూపూడి రంగరాజు, రమేష్ నాయుడు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుందని తెలిపారు. అంతేకాదు బీజేపీ మ్యానిఫెస్టోలో కూడా జిల్లాల పెంపు అంశం పెట్టామని పేర్కొన్నారు. అయితే...దీనిపై కొంతమేర చర్చ జరగాల్సివుందని తెలియజేశారు. ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పీఆర్సీ ఎన్నడూ లేని విధంగా ఉందన్నారు. వైసీపీ సర్కార్ పాలన మొత్తం రివర్స్ లో వెళ్తుందని కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

Updated Date - 2022-01-26T17:15:44+05:30 IST