వైభవంగా లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-18T06:07:38+05:30 IST

సిరిసిల్లలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

వైభవంగా లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
సూర్యవాహనంపై లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఊరేగింపు

- సూర్యవాహనంపై లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఊరేగింపు

 సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, అక్టోబరు 17: సిరిసిల్లలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు ఆదివారం ఆలయంలో మలయప్పస్వామి త్రివిక్రమ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం హోమం నిర్వహించిన అనంతరం లక్ష్మీవేం కటేశ్వరస్వామివారిని సూర్యవాహనంపై పురవీధుల గుండా ఊరేగించగా మహిళలు మంగళహారతులతో స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని కాలింగమర్ధనముపై పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం ఆలయంలో హోమం నిర్వహించడంతో పాటు సుందరకాండ పారాయణం, విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, భగవద్గీత పారాయణం, శ్రీ సుదర్శన శతకపారాయణము, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణములు నిర్వహించారు. కార్యక్రమం లో ఆలయ అధ్యక్షులు ఉప్పల విఠల్‌రెడ్డి, ధర్మకర్తలు కోడం శ్రీనివాస్‌, మేర్గు లక్ష్మణ్‌, మామిడాల రమణ, అల్లాడి సరస్వతి, కత్తెర సంతోషిణి, ఎక్స్‌ అఫీషియో మెంబర్‌ రాంమోహనాచారి, కార్యనిర్వహణాధికారి నాగారపు శ్రీనివాస్‌, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T06:07:38+05:30 IST