వైభవంగా శ్రీలలితా యాగం ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-21T05:27:44+05:30 IST

కరోనా నివారణ కోసం లోకకల్యాణార్థం కుర్తాళం పీఠం అర్చకుడు మాచవోలు రమేష్‌శర్మ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీలలితా యాగం నెల్లూరులో ఘనంగా ప్రారంభమైంది.

వైభవంగా శ్రీలలితా యాగం ప్రారంభం
శ్రీలలితా హోమం చేస్తున్న రుత్వికులు

నెల్లూరు(సాంస్కృతికం), జూన్‌ 20 : కరోనా నివారణ కోసం లోకకల్యాణార్థం కుర్తాళం పీఠం అర్చకుడు మాచవోలు రమేష్‌శర్మ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీలలితా యాగం నెల్లూరులో ఘనంగా ప్రారంభమైంది. ఉదయం మహా సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహ వచనం, మాతృకా పూజ, పంచగవ్య సంస్కారం, బుత్విగ్వరణం జరిగాయి. అంకురార్పణ, రక్షాబంధన, అగ్ని మధనం, అఖండ దీపం, మండపారాధన, గణపతి హోమం, లలిత సహస్రనామ హోమాలు జరిగాయి. సాయంత్రం విశేష పూజలు, హోమాలు జరిగాయి.

Updated Date - 2021-06-21T05:27:44+05:30 IST