భూసేకరణ, కాల్వల పనులు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-01-20T04:54:03+05:30 IST
వనపర్తి జిల్లాలోని పునరావాస కేంద్రాలు, భూసేకరణ, కాల్వల పనులు సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా
- పునరావాస పనులపై ఆరా
వనపర్తి అర్బన్, జనవరి 18 : వనపర్తి జిల్లాలోని పునరావాస కేంద్రాలు, భూసేకరణ, కాల్వల పనులు సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూసేకరణ, పునరావాస కేంద్రాలు, పాల మూరు-రంగారెడ్డి, మహాత్మగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, రాజీవ్ భీమా పథకాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పునరా వాస పనులపై ఆరా తీశారు. సంకిరెడ్డిపల్లి, పాన్గల్, వీపనగండ్ల, చిన్నం బావి అవార్డులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ ద్వారా కొత్త పనులు ఆన్లైన్లో అప్లోడ్ చేయా లని, కొత్త సాఫ్ట్వేర్లో చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా కాలువల పనులను సత్వరం పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్ఈ సత్యశీలారెడ్డి, డీఈ, ఈఈ తదితరులున్నారు.