‘భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి’

ABN , First Publish Date - 2021-10-23T06:23:07+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీనరసింహ స్వామి లిఫ్ట్‌ఇరిగేషన్‌ టీమ్‌ప్యాకేజీ నెంబర్‌27కు సంబంధించిన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు.

‘భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి’
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు

నిర్మల్‌టౌన్‌, అక్టోబరు 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీనరసింహ స్వామి లిఫ్ట్‌ఇరిగేషన్‌ టీమ్‌ప్యాకేజీ నెంబర్‌27కు సంబంధించిన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ... భూసేకరణకు సంబంధించిన అంశంపై ప్యాకేజీ నెంబర్‌ 27 ద్వారా పంప్‌ హౌజ్‌, పైప్‌ లైన్‌  కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదలశాఖ ఈఈ రామారావు, డీఈ జగదీష్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్రవంతి, తహసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-23T06:23:07+05:30 IST