నిరుపేదలకు భూపట్టాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-08-14T10:58:03+05:30 IST

నిరుపేద గిరిజన రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

నిరుపేదలకు భూపట్టాలు ఇవ్వాలి

మంచాల : నిరుపేద గిరిజన రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల పరిధి ఎల్లమ్మతండాకు చెందిన రైతులతో కలిసి ఆర్‌డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ బోడకొండ రెవెన్యూ 94 నుంచి 195 సర్వే నెంబర్లలోని సుమారు 1188 ఎకరాల భూమిని ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు సాగుచేసుకుంటున్నారని తెలిపారు. ఆ భూమి రికార్డుల్లో గులాం ముస్తఫా పేరిట ఉందని అన్నారు. విచారణ జరిపి పేదరైతులకు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి శ్రీనివా్‌సరెడ్డి, రావులజంగయ్య, యువకులు దేవ్‌రాం పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-14T10:58:03+05:30 IST