ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2021-01-15T17:44:41+05:30 IST

ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి

ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి

జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఈ ఘటనలో భవనాలు ధ్వంసం కాగా ఏడుగురు మృతి చెందారు. వందల సంఖ్యలో జనం గాయపడ్డారని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. భూకంప కేంద్రాన్ని మజేన్‌ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్ల దూరంలోని భూమిలోపల పది కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది. 7 సెకన్ల పాటు భూమికి కంపించడంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. మజేనే నగరంలో నలుగురు మరణించగా 637 మంది గాయపడ్డారు. అలాగే మాముజు ప్రావిన్స్‌లోనూ భూంకంప ప్రభావం కనిపించింది.  ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.


Updated Date - 2021-01-15T17:44:41+05:30 IST