ఎస్ఎఫ్సీ అధికారులపై భూ కబ్జాదారుల దాడి
ABN , First Publish Date - 2021-10-24T03:08:40+05:30 IST
ప్రభుత్వ భూమిని అడ్డుకున్న ఎస్ఎఫ్సీ అధికారులపై కబ్జాదారులు
హైదరాబాద్: ప్రభుత్వ భూమిని అడ్డుకున్న ఎస్ఎఫ్సీ అధికారులపై కబ్జాదారులు దాడి చేసారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం సర్వే నెం 307లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు భూములు ఉన్నాయి. ఈ భూములను కొంతమంది కబ్జాలు చేసారు. ఈ భూముల్లో కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్ఎఫ్సీ అధికారులపై 30 మంది కబ్జాదారులు దాడి చేసారు. రెవెన్యూ సిబ్బంది ఫోన్లను కబ్జాదారులు లాక్కున్నారు. దీంతో లారీని అధికారులు సీజ్ చేసారు. దాడికి పాల్పడ్డవారిపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేసారు.