రెండేళ్ల వైసీపీ పాలనలో భూ కబ్జాలు
ABN , First Publish Date - 2021-06-14T04:42:23+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ కబ్జాలు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడదల చేశారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ‘కళా’
రాజాం, జూన్ 13: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ కబ్జాలు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడదల చేశారు. కబ్జాదారులెవరో, అవి నీతిపరులెవరో రాష్ట్ర ప్రజలకే కాదు గూగుల్కి కూడా తెలుసన్నారు. టీడీపీకి చెందిన బడుగు, బలహీన వర్గాల నాయకులను అణిచి వేసేందుకు జగన్ కంకణం కటు ్టకున్నారని ఆరోపించారు. లేని కబ్జాలు ఉన్నట్టు చూపుతూ కావాలనే టీడీపీ నాయ కులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో విశాఖపట్నంలో వైసీపీ నేతలు ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు.