భూ సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-05-03T06:26:38+05:30 IST
కాసిపేట మండలంలోని గుల్వాపూర్ గ్రామానికి చెందిన కేశవరావు తమ గ్రామంలో నెలకొన్ని భూమి సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో అంకిత్ను కోరారు. సోమవారం స్థానిక పీవో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపిర్యాదుల విభాగంలో గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉట్నూర్ మండలంలోని సాలేగూడకు చెందిన టేకాం భీంరావు ట్రైకార్ రుణాలు ఇప్పించాలని,
ఉట్నూర్ రూరల్, మే 2: కాసిపేట మండలంలోని గుల్వాపూర్ గ్రామానికి చెందిన కేశవరావు తమ గ్రామంలో నెలకొన్ని భూమి సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో అంకిత్ను కోరారు. సోమవారం స్థానిక పీవో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపిర్యాదుల విభాగంలో గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉట్నూర్ మండలంలోని సాలేగూడకు చెందిన టేకాం భీంరావు ట్రైకార్ రుణాలు ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం మాలన్గోందికి చెందిన గ్రామస్తులు మంచినీటి సమస్య పరిష్కరించాలని, గాదిగూడ మండలం అర్జునికి చెంన ఆడ సుశీల టెట్ కోచింగ్ సెంటర్లో సీటు ఇప్పించాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేందర్ పాల్గొన్నారు.