ఫోర్జరీ డాక్యుమెంటుతో భూరిజిస్ట్రేషన్
ABN , First Publish Date - 2022-01-18T04:27:25+05:30 IST
ఫోర్జరీ డాక్యుమెంటుతో భూరిజిస్ట్రేషన్
- చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి
శంషాబాద్: మున్సిపాలిటీలోని సాతం రాయి గ్రామానికి చెందిన కొంత భూమిని కొందరు వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. టీపీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు జే.నరేందర్, శంషాబాద్ కౌన్సిలర్ సంజయ్యాదవ్తో కలసి సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సాతంరాయి గ్రామం సర్వేనెంబర్ 19/అ/1లో 1,15 ఎకరాల భూమి కేరళ పట్టాదారు శ్రీకాంత్ షనయ్ అనే వ్యక్తి పేరున శంషాబాద్ తహసీల్దార్ సాయంతో ఫోర్జరీ డాక్యుమెంటును సృష్టించినట్లు పేర్కొన్నారు. ధరణి రికార్డులో కూడా ఈ డాక్యుమెంటు వివరాలు ఉన్నాయని, సాతంరాయిలో ఓ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసినట్లు వివరించారు. ఈ మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.