ఆయిల్‌ఫెడ్‌ కోసం స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-06-20T05:42:21+05:30 IST

పీలేరు - తిరుపతి మార్గంలో ఏపీ కో-ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ గ్రోవెర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీ ఆయిల్‌ఫెడ్‌)కు భూమి కేటాయించడానికి శనివారం మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి స్థలాన్ని పరిశీలించారు.

ఆయిల్‌ఫెడ్‌ కోసం స్థల పరిశీలన

పీలేరు, జూన్‌ 19: పీలేరు - తిరుపతి మార్గంలో ఏపీ కో-ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ గ్రోవెర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీ ఆయిల్‌ఫెడ్‌)కు భూమి కేటాయించడానికి శనివారం మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి స్థలాన్ని పరిశీలించారు. తిరుపతి మార్గంలో ఆయిల్‌సీడ్స్‌ స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆయిల్‌సీడ్స్‌లోని 18.78 ఎకరాల స్థలం ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించడానికి ప్రతిపాదించారు. దీంతో సబ్‌కలెక్టర్‌ ఆ స్థలాన్ని శనివారం సందర్శించారు. గూడరేవుపల్లె పంచాయతీ సర్వేనంబరు 199/2లో 17.76 ఎకరాలు, ఎర్రగుంటపల్లె పంచాయతీ సర్వే నంబరు 740/3 బి1లో 1.01 ఎకరాల స్థలాన్ని గ్రోవెర్స్‌ ఫెడరేషన్‌కు ఇవ్వడానికి ఎంపిక చేశారు. ఆమెవెంట తహసీల్దార్‌ పుల్లారెడ్డి, డీడీ కిరణ్‌, సర్వేయర్‌ దేవి, వీఆర్వో ప్రసాద్‌, సురేష్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-06-20T05:42:21+05:30 IST