పాలిచెర్లలో భూముల రీ సర్వే
ABN , First Publish Date - 2021-06-24T02:10:36+05:30 IST
వైఎస్సార్ భూహక్కు-భూరక్ష పథకంలో భాగంగా పాలిచెర్ల గ్రామంలో బుధవారం రీసర్వే చేశారు.
గూడూరురూరల్, జూన్ 23 వైఎస్సార్ భూహక్కు-భూరక్ష పథకంలో భాగంగా పాలిచెర్ల గ్రామంలో బుధవారం రీసర్వే చేశారు. తహసీల్దారు లీలారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ రెండో విడతలో భాగంగా పాలిచెర్ల, అయ్యవారిపాళెం తదితర గ్రామాలల్లో రీ సర్వే చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్వేయర్ రామ్కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.