నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

ABN , First Publish Date - 2020-09-25T11:04:02+05:30 IST

భారీవర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల నేపాల్ దేశంలో 10 మంది మరణించారు....

నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

ఖాట్మాండు (నేపాల్): భారీవర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల నేపాల్ దేశంలో 10 మంది మరణించారు. నేపాల్ దేశంలోని సింగిజా జిల్లాలో భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటం వల్ల ఒకే కుటుంబంలోని 9 మంది మరణించారని చీఫ్ జిల్లా ఆఫీసర్ గంగా బహదూర్ చెట్రీ చెప్పారు. భారీవర్షాలు, వరదల వల్ల నేపాల్ దేశంలో మొత్తం 10 మంది మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడటంతో అతన్ని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు.  సోమవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం శనివారం వరకు కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.భారీవర్షాల నేపథ్యలో వరదలు వెల్లువెత్తడంతో నేపాల్ వాతావరణశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. 

Updated Date - 2020-09-25T11:04:02+05:30 IST