అసెంబ్లీలో జగన్ మాట్లాడింది మర్చిపోయారా?: లంకా దినకర్
ABN , First Publish Date - 2020-05-25T23:35:40+05:30 IST
దేవుడి ఆస్తులు అమ్మితే పాపం తగులుతుందని అసెంబ్లీలో జగన్ మాట్లాడింది మర్చిపోయారా...
విజయవాడ: దేవుడి ఆస్తులు అమ్మితే పాపం తగులుతుందని అసెంబ్లీలో జగన్ మాట్లాడింది మర్చిపోయారా? అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ తెచ్చిన జీవోని అడ్డుపెట్టుకుని ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానిది ద్వంద్వ వైఖరన్నారు. తిరుమల చుట్టూ అన్యమత ప్రార్థనామందిరాలు ఏర్పాటు చేశారని చెప్పారు. హిందూ ఆచార సాంప్రదాయాలపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆస్తుల్ని సంరక్షించడం చేతకాని వాళ్లు బోర్డులో అవసరమా? అని ప్రశ్నించారు. బోర్డు చైర్మన్లు, సభ్యులు ప్రభుత్వానికి తాబేదార్లుగా ఉన్నారని వ్యాఖ్యానించారు.