బ్లాంక్ జీవోల నుంచి లాక్ జీవోల వైపు ఏపీ పాలన: లంకా దినకర్
ABN , First Publish Date - 2021-08-17T17:48:21+05:30 IST
బ్లాంక్ జీవోల నుంచి లాక్ జీవోల వైపు రాష్ట్రంలో పాలన వెళ్ళిందని లంకా దినకర్ విమర్శించారు.
అమరావతి: బ్లాంక్ జీవోల నుంచి లాక్ జీవోల వైపు రాష్ట్రంలో పాలన వెళ్ళిందని బీజేపీ నాయకుడు లంకా దినకర్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పాలనా నిర్ణయాలు ప్రజలకు తెలియకూడదని అనుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల పథకాలను మాత్రం సీఏం జగన్ స్టిక్కర్లతో మీడియాలో వందల కోట్ల ప్రజా ధనంతో ప్రచారం చేసుకుంటున్నారని లంకా దినకర్ ఆరోపించారు.