మాదకద్రవ్యాల కేసులో ఏపీకి పరువు నష్టం జరిగింది: లంకా దినకర్

ABN , First Publish Date - 2021-10-13T16:56:17+05:30 IST

మాదకద్రవ్యాల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరువు నష్టం జరిగిందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

మాదకద్రవ్యాల కేసులో ఏపీకి పరువు నష్టం జరిగింది: లంకా దినకర్

అమరావతి: మాదకద్రవ్యాల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరువు నష్టం జరిగిందని, అది ఇంకా దిగజారే ప్రమాదం ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దిగుమతి ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఉండక పోవచ్చు కానీ ఆఫ్ఘన్ నుంచి భారతదేశంలోకి దిగిన హెరాయిన్ బుకింగ్ ఏక్కడ నుంచి జరిగిందన్నారు. ఆషి ట్రేడింగ్ ద్వారా హెరాయిన్ బుక్ చేశారని చెప్పిందే డీఆర్ఐ కదా అని అన్నారు. ఏన్‌ఐఏ బృందం విజయవాడ వచ్చిందా? లేదా? అని ప్రశ్నించారు. ఇంత పెద్ద కేసు వ్యక్తులకు ఆపాదించి రాజకీయ లబ్ధి పొందాలని, దాని ప్రభావం తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని లంకా దినకర్ విమర్శించారు.

Updated Date - 2021-10-13T16:56:17+05:30 IST