ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.. మన్ కీ బాత్‌లో ప్రధాని వ్యాఖ్య

ABN , First Publish Date - 2020-05-31T17:14:33+05:30 IST

ప్రధాని మోదీ జాతి ఉద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పట్టాలెక్కుతోందని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ సందర్భంగా ప్రజలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని పిలుపు నిచ్చారు.

ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.. మన్ కీ బాత్‌లో ప్రధాని వ్యాఖ్య

న్యూఢిల్లీ: అర్థిక వ్యవస్థను పునఃప్రారంభించే దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. లాక్ డౌన్ స్ఫూర్తిని కొనసాగించేందుకు జూన్ 30 వరకూ లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.


జూన్ 8 నుంచి అనేక రంగాల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. తరువాతి వారాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై మరిన్ని సడలింపులు ఇవ్వడం ఆధారపడి ఉంటుంది.


ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతి ఉద్దేశించి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పట్టాలెక్కుతోందని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ సందర్భంగా ప్రజలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని పిలుపు నిచ్చారు.


మరోవైపు సడలింపులకు సంబంధించి హొం శాఖ ఇప్పటికే అనేక మార్గదర్శకాలు విడుదల చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభం, స్కూళ్లు, సినిమాహాళ్లు తెరవడం వంటి విషయాలపై భవిష్యత్తులో అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. మెట్రో సర్వీసుల ప్రారంభంపై కూడా మరి కొద్ది వారాల్లో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. 

Updated Date - 2020-05-31T17:14:33+05:30 IST