లారీ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2020-09-19T09:17:59+05:30 IST
లారీ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారి లంకెలపాలెం కూ
లంకెలపాలెం, సెప్టెంబరు 18: లారీ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారి లంకెలపాలెం కూడలికి సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కేఎస్వీ సూర్యనారాయణరెడ్డి ద్విచక్ర వాహనంపై అనకాపల్లి నుంచి వస్తుండగా, లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.