కారును ఢీకొన్న లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-03-05T06:39:32+05:30 IST
కారు లారీ ఢీకొని పలువురికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని చెట్ల నర్సంపల్లి గ్రామ సమీపంలో జరిగింది.
దౌల్తాబాద్ మార్చి 4: కారు లారీ ఢీకొని పలువురికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని చెట్ల నర్సంపల్లి గ్రామ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గజ్వేల్కు చెందిన రాజు అనే వ్యక్తి చేగుంటలో ఉంటున్న తన తల్లిదండ్రులు, చెల్లెలిని ఇంటికి తీసుకొచ్చేందుకు బుధవారం స్నేహితుడు భానుప్రసాద్తో కలిసి కారులో వెళ్లాడు. గురువారం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో చెట్ల నర్సంపల్లి గ్రామ సమీపంలో విజయవాడకు చెందిన ఓ లారీ ఎదుటి వైపు నుంచి వేగంగా కారును ఢీకొట్టి సుమారు 100 మీటర్ల వరకు తోసుకుపోయింది. ఈ సందర్భంగా కారులో ప్రయాణిస్తున్న రాజు, తండ్రి నర్సింహులు, తల్లి లక్ష్మి, చెల్లెలు కవిత, స్నేహితుడు భానుప్రసాద్లకు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే 108 వాహనం ద్వారా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.