లారీ ఢీ.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-03-06T05:46:11+05:30 IST

మండలంలోని అంటిపేట సమీపంలోగల 36వ రాష్ట్రీయ రహదారిపై బైకును లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

లారీ ఢీ.. ఒకరి మృతి

సీతానగరం: మండలంలోని అంటిపేట సమీపంలోగల 36వ రాష్ట్రీయ రహదారిపై బైకును లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కాశీపేట గ్రామానికి చెందిన యజ్జల రాము(26) అంటిపేట నుంచి స్వగ్రామమైన కాశీపేట వస్తుండగా పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు రోదిస్తున్నారు. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Updated Date - 2021-03-06T05:46:11+05:30 IST